-
సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వరూపం 2
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్ సినిమాలను మాత్రం పక్కన పెట్టలేదు. త్వరలో నటనకు గుడ్బై చెపుతున్నట్టుగా ప్రకటించిన లోకనాయకుడు తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తున్నాడు. కమల్ ఎన్నో కష్టనష్టాలకోర్చి తెరకెక్కించిన సినిమా విశ్వరూపం 2. ముందు ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా ఈ సినిమాను ప్రారంభించారు. కానీ తరువాత రవిచంద్రన్ తప్పుకోవటంతో కమలే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. కమల్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన విశ్వరూపం 2 ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ను జారీ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ నెల రెండు లేదా మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
'విశ్వరూపం 2' ఏమైంది..?
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా విశ్వరూపం. కమల్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించటంతో ఈ సినిమాకు సీక్వెల్ను కూడా రూపొందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు కావస్తున్నా రిలీజ్ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదంటున్నాయి చెన్నై సినీ వర్గాలు. తొలి భాగం ఘనవిజయం సాధించటంతో రెండో భాగాన్ని మరింత భారీగా తెరకెక్కించాడు ఆస్కార్ రవిచంద్రన్. ఇలోగా రవిచంద్రన్ వేరే సినిమాలు నిర్మించటం, అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో ఆర్థికంగా దెబ్బతిన్నాడు. దీంతో విశ్వరూపం 2 పనులు ఆగిపోయాయి. షూటింగ్ పూర్తయినా, విజువల్ ఎఫెక్ట్స్తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరో 25 కోట్లకు పైగా బడ్జెట్ అవసరం, ఇప్పట్లో అంత బడ్జెట్ పెట్టడం కుదరదనుకున్న చిత్రయూనిట్ ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారట. -
సూపర్స్టార్తో ‘ఆస్కార్’
తమిళసినిమా: ఎట్టకేలకు సూపర్స్టార్తో చిత్రం చేసే అవకాశం ఆస్కార్ ఫిలింస్ చేజిక్కించుకుంది. విశ్వనాయకుడితో ఓ దశావతారం, విజయకాంత్ హీరోగా వానతై పోలా, రమణ, విక్రమ్ కథానాయకుడిగా అన్నియన్, తాజా చిత్రం ఐ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్. విజయ్, అజిత్, సూర్య లాంటి యువస్టార్ హీరోలతోనూ చిత్రాలు తీసిన ఈ సంస్థ ఒక్క రజనీకాంత్తో ఇప్పటి వరకు చిత్రం చేయలేదు. ఆ కొరత ఇప్పుడు తీరబోతోందన్నది తాజా వార్త. నిజం చెప్పాలంటే రజనీకాంత్ ఇటీవల నటించిన కోచ్చడయాన్, లింగా రెండు చిత్రాలు నిరాశపరిచాయి. ఇలాంటి తరుణంలో సూపర్స్టార్ తదుపరి చిత్రం ఏమిటన్నది చాలామందిని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఇలాంటి పరిస్థితిలో శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2 చేస్తారని, పి.వాసు కథ వినిపించారని, బాషా ఫేమ్ సురేష్కృష్ణ కూడా లైన్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే తాజా రజనీకాంత్ను ఆస్కార్ ఫిలింస్ సంస్థలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది అనధికార నిర్ధారణ. ఆస్కార్ ఫిలింస్లో రజనీకాంత్ నటించడం దాదాపు ఖరారైనట్లే. ఈ అంశంపై ఆస్కార్ రవిచంద్రన్ ఇటీవల రజనీకాంత్ను కలిశారు. అయితే ఈ చిత్రం విషయం చర్చల్లో ఉందని ఆయన చెప్పడం విశేషం. ఆస్కార్ ఫిలింస్లో ఏఆర్ మురుగదాస్ ఇంతకుముందు రమణ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. రవిచంద్రన్ ఈ సారి సూపర్స్టార్తో ఎలాంటి అద్భుతాన్ని సృష్టించనున్నారో చూడాల్సిందే. చిత్రం ఏడాది చివర్లో తెరపైకి రానుంది. -
త్వరలో తెరపైకి తిరుమణం ఎనుం నిఖా
తిరుమణం ఎనుం నిఖా చిత్రం త్వరలో తెరపైకి రానుంది. యువ నటుడు జయ్, నజ్రియా నజిమ్ జంటగా నటించిన చిత్రం తిరుమణం ఎనుం నిఖా. నవ దర్శకుడు అనీష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఆస్కార్ ఫిలింస్ నిర్మించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గత నెలలోనే విడుదల కావలసి ఉంది. కొన్ని సమస్యల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఎదురైన ఆటంకాలను తిరుమణం ఎనుం నిఖా అధిగమించిందని ఆ చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ వివాహమనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రధాన ఘట్టమన్నారు. అలాంటి ఇతి వృత్తంతో నిర్మించిన తిరుమణం ఎనుం నిఖా ఎవరి మనోభావాలను కించపరచాలనో గాయపరచాలనో రూపొందించలేదన్నారు. ఒక్కో మతం ఆచార వ్యవహారాలను, సంస్కృతి సంప్రదాయాలను గొప్పగా ఆవిష్కరించిన చిత్రమిదన్నారు. ఏ విషయంలోనైనా చక్కని అవగాహన అవసరమని చెప్పే చిత్రం తిరుమణం ఎనుం నిఖా అని తెలిపారు. భార్యాభర్తలు గాని, సహోదరులుగాని, స్నేహితులుగాని, బంధువులుగాని పరస్పర అవగాహనతో, అర్థవంతమైన జీవితాన్ని గడపాలన్నదే చిత్ర ప్రధాన అంశమని వివరించారు. చిత్రానికి నెలకొన్న సమస్యలు తొలగాయని ముస్లిం సోదరుల పండుగ రంజాన్ రోజున గాని తిరుమణం ఎనుం నిఖా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement