Please enable javascript.Tirumala Punugu Pilli,Punugu Pilli: తిరుమలలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షం.. ఆసక్తికర విషయాలు - local people found rare punugu pilli in tirumala - Samayam Telugu

Punugu Pilli: తిరుమలలో అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షం.. ఆసక్తికర విషయాలు

Authored byతిరుమల బాబు | Samayam Telugu 17 Nov 2022, 6:03 am
Subscribe

Punugu Pilli In Tirumala కనిపించింది. ఎస్వీ హైస్కూల్ దగ్గర బుధవారం సాయంత్రం పలువురికి ఈ పునుగు పిల్లి కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.. వారు ఈ పునుగును స్వాధీనం చేసుకున్నారు. అరుదైన జంతువుల్లో ఈ పునుగు పిల్లి ఒకటి. గతంలో విజయవాడలో ప్రత్యక్షమైన పిల్లి. తిరుమల శ్రీవారికి అభిషేక సేవకు వినియోగించే సుగంధ ద్రవ్యాలను అందించే జీవిగా గుర్తింపు. టీటీడీ ప్రత్యేకంగా ఈ పిల్లుల్ని గోశాలలో కూడా పెంచుతోంది.

ప్రధానాంశాలు:

  • తిరుమలలో ప్రత్యక్షమైన పునుగు పిల్లి
  • అటవీశాఖ అధికారుల స్వాధీనం
  • ప్రత్యేకంగా పెంచుతున్న టీటీడీ
Tirumala Punugu Pilli
తిరుమల (Tirumala)లో అరుదైన పునుగు పిల్లి (Punugu Pilli) ప్రత్యక్షం అయ్యింది. తిరుమలలోని ఎస్వీ హైస్కూల్ దగ్గర బుధవారం సాయంత్రం పలువురికి ఈ పునుగు పిల్లి కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఈ పునుగు పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారికి అభిషేక సేవకు వినియోగించే సుగంధ ద్రవ్యాలను అందించే జీవి ఈ పునుగుపిల్లి. ఇవి కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ పునుగు పిల్లులు అంతరించిపోతుడంటంతో.. టీటీడీ ప్రత్యేకంగా పునుగు పిల్లులను తిరుమలలోని గోశాలలో పెంచుతున్న సంగతి తెలిసిందే.
అంతేకాదు గతేడాది విజయవాడలో ఈ అరుదైన పునుగుపిల్లి కనిపించింది. ఓ ఇంటి ఆవరణలో కనిపించడంతో జాగ్రత్తగా పట్టుకుని బోనులోపెట్టారు.అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.. వారు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పునుగు పిల్లి విజయవాడ ఎలా వచ్చిందా అని ఆరా తీస్తే.. తిరుమలలోని నిత్యన్నదాన కార్యక్రమం కోసం కూరగాయలు తీసుకెళ్లేందుకు టీటీడీ లారీ విజయవాడ వస్తుందట. ఈ లారీలోనే పునుగుపిల్లి బెజవాడకు చేరి ఉంటుందని అప్పట్లో అనుమానించారు.

అరుదైన జంతవుల్లో పునుగు పిల్లి ఒకటి.. ఈ పిల్లి నుంచి తీసిన తైలాన్ని వెంకటేశ్వర స్వామి అభిషేకం అనంతరం విగ్రహానికి ప్రతి శుక్రవారం పూస్తారని చెబుతారు. వీటిని ప్రత్యేకంగా టీటీడీ పెంచుతోంది. ఈ పునుగు పిల్లి వన్యప్రాణి కాబట్టి.. గోశాలలో బంధించి పెంచడం తప్పని గతంలో అభ్యంతరాలు కూడా వచ్చాయి. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని క్లాజు ప్రకారం.. కానీ దైవ కార్యక్రమాలకు వన్యప్రాణుల సేవలను వినియోగించుకోవచ్చని ఉంది. ఈ చట్టం ప్రకారమే టీటీడీ పునుగు పిల్లులను పెంచుతోంది.

ఈ పునుగుపిల్లి శరీరం నుంచి తైలం తీయడానికి కొన్ని ఏర్పాట్లు చేస్తారు. పునుగు పిల్లిని ఇనుప జల్లెడలో ఉంచుతారు.. అక్కడ చందనపు కర్రను నిలబెడతారు. ఈ పిల్లికి ప్రతి పది రోజులకు ఒకసారి శరీర గ్రంథుల ద్వారా చెమటను విసర్జిస్తుందట. ఇదంతా పునుగు శరీరంపై కొద్దిగా అట్టలా ఏర్పడుతంది.. ఈ పిల్లి తన శరీరాన్ని ఇనుప జల్లెడలో నిలబెట్టిన చందనపు కర్రకు రుద్దుతుంది. ఆ కర్రకు శరీరంపై చెమట ద్వారా వచ్చినదంతా బంకలా అంటుకుపోతోంది. దానని తీసి ఉపయోగిస్తుంటారు. ఈ పునుగు పిల్లి అంతరించిపోతున్న జీవ జాతుల్లో ఒకటి కావడంతో చాలా అరుదైన జంతువుగా భావిస్తారు. ఈ పునుగు పిల్లిని ఇంగ్లిష్‌లో సివెట్, టాడీ క్యాట్ అని పిలుస్తారు. పునుగుపిల్లి భారత్‌తో పాటూ సింగపూర్‌, మయన్మార్, భూటాన్, శ్రీలంకలలో మాత్రమే ఉంటుందట.
Read Latest Andhra Pradesh News and Telugu News
తిరుమల బాబు
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి
కామెంట్ రాయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.